
విశాఖ సమీపంలోని భోగాపురం, పోలిపల్లి రెవెన్యూ పరిధిలో రూ. 1.08 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులు వేగవంతమవుతున్నాయి.
యంత్రాల కూలింగ్ అవసరాల కోసం పూసపాటిరేగ మండలం కోనాడ సముద్ర తీరం నుంచి శుద్ధి చేసిన నీటిని పైపులైన్ల ద్వారా తరలించే అంశంపై అధికారులు, ప్రతినిధులు చర్చించారు.
మొదటి దశలో పోలిపల్లిలో 500 మెగావాట్ల డేటా సెంటర్ను 2028 అక్టోబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.