
గుంటూరులో అనుమతి లేకుండా మెగా డీఎస్సీ నిరసన ర్యాలీ నిర్వహించినందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి సహా 17 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది.
ఈనెల 10న శంకరవిలాస్ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ చేపట్టారని పోలీసులు తెలిపారు.
ప్రజా రవాణాకు, ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు అరండల్పేట ఎస్ఐ ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.