
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం గోగన్నమఠం ప్రాథమిక పాఠశాలలో కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే చదువుతుండటం చర్చనీయాంశమైంది.
ఒక్క విద్యార్థి కోసం ఒక ఉపాధ్యాయుడు, ఒక వంట ఆయమ్మ విధులు నిర్వహిస్తుండటం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుదలకు నిదర్శనంగా మారింది.
ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రుల మొగ్గు, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.