
సౌతాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్కు ముందు, అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు దక్షిణాఫ్రికాతో 4 నుంచి 6 వన్డేల సిరీస్ ఆడేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
ప్రస్తుత ఎఫ్టీపీ షెడ్యూల్లో ఈ సిరీస్ లేనప్పటికీ, భారత టీమ్ మేనేజ్మెంట్ అభ్యర్థన మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపినట్లు బీసీసీఐ అధికారి తెలిపారు.
24 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాలో వన్డే వరల్డ్ కప్ జరుగుతుండటంతో, 15 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించేందుకు భారత్ ఈ ముందస్తు సిరీస్ను కీలకంగా భావిస్తోంది.