
జార్ఖండ్లోని గఢ్వా జిల్లాలో రైల్వే ట్రాక్ సమీపంలో రీల్స్ చేస్తున్న 19 ఏళ్ల పూర్ణిమ కుమారి అనే యువతిని రైలు ఢీకొనడంతో ఆమె రెండు చేతులను కోల్పోయింది.
రాంచీ-చోపన్ ఎక్స్ప్రెస్ రైలు వేగాన్ని, దూరాన్ని అంచనా వేయలేకపోవడంతో మంగళవారం ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్నేహితులు ఆమెను గఢ్వా సదర్ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాలని వైద్యులు సూచించారు.