
2036 ఒలింపిక్ క్రీడల నిర్వహణకు భారత్ పోటీ పడుతున్న నేపథ్యంలో, అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
సీఆర్డీఏ సమావేశంలో ఈ ప్రతిపాదిత స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్టుపై చర్చించి, దీనిని అత్యంత అనువైన క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ఒలింపిక్స్కు మన దేశానికి అవకాశం వస్తే, క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను అమరావతిలో సిద్ధం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.