
బొలీవియాలోని వియాచా సిటీలో ఉన్న మిలిటరీ బేస్లో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగిన భారీ పేలుడులో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ప్రమాదంలో 58 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని, వారిలో 52 మంది సాధారణ పౌరులు ఉన్నారని రక్షణ మంత్రి ఎర్నెస్టో జస్టినియానో తెలిపారు.
పేలుడు ధాటికి డజన్ల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయని, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.