
రష్యా అధ్యక్షుడు పుతిన్కు చెందిన రూ. 12,000 కోట్ల విలువైన ప్యాలెస్ను రక్షిస్తున్న అత్యాధునిక ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఉక్రెయిన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి.
రష్యాలోని టాటర్స్తాన్లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారంపై 450కి పైగా డ్రోన్లతో జరిగిన దాడిలో 13 మంది మరణించారని నివేదికలు పేర్కొన్నాయి.
గత ఆగస్టు 8న ఇదే ఎస్-400 వ్యవస్థ నుంచి ఆరు క్షిపణులను ఉక్రెయిన్ నగరాలపైకి రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ కమాండర్ మేజర్ రాబర్ట్ బ్రోవ్డీ ఆరోపించారు.