
మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ పేరుతో రూ.కోట్ల మోసానికి పాల్పడిన నిందితులపై సమగ్ర విచారణకు హోంమంత్రి అనిత సిట్ను ఏర్పాటు చేశారు.
ఈ స్కామ్లో సుమారు 200 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించామని, డీసీపీ తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుందని మంత్రి తెలిపారు.
బాధితుల ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.