
సన్కిస్డ్ ఆర్గానిక్, బెల్ట్రాక్స్, సైబర్రూట్ అనే మూడు భారతీయ కంపెనీలు అమెరికన్ పౌరుల డేటాను చోరీ చేస్తున్నాయని ముగ్గురు యూఎస్ సెనెటర్లు ఆరోపించారు.
ఈ సంస్థలను ఎంటిటీ లిస్టులో చేర్చి, అమెరికా సాఫ్ట్వేర్, క్లౌడ్ వసతులు అందకుండా చూడాలని వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్నిక్కు లేఖ రాశారు.
ఖతార్ ప్రభుత్వ ప్రోద్బలంతో ఈ కంపెనీలు హ్యాకింగ్కు పాల్పడ్డాయని, గూగుల్ వంటి సంస్థలపై కూడా కేసులు వేశాయని సెనెటర్లు పేర్కొన్నారు.