
అధిక కెఫిన్ కలిగిన పానీయాల లేబుళ్లపై 'ఎనర్జీ డ్రింక్' అనే పదాన్ని వాడకూడదని FSSAI ఆదేశించింది.
ఈ మార్పులు చేయడానికి కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చామని, నిబంధనలు పాటించని పక్షంలో చర్యలు ఉంటాయని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.
రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే స్టింగ్, రెడ్ బుల్ వంటి పానీయాల బాటిళ్లను స్వాధీనం చేసుకుని, ఈ-కామర్స్ సంస్థలను ప్రకటనలు నిలిపివేయాలని ఆదేశించింది.