
జాతీయ పర్మిట్ పరిధిలోని ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సీఎన్జీ వాహనాల గరిష్ఠ వయస్సును మరో ఐదేళ్లు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది.
ప్రస్తుతం ఉన్న 12-15 ఏళ్ల పరిమితిని ఈ ప్రతిపాదన ద్వారా వరుసగా 17 ఏళ్లు, 20 ఏళ్లకు పెంచనున్నారు.
పర్మిట్ ఆథరైజేషన్ను ఏటా కాకుండా ఐదేళ్లకు ఒకేసారి రూ. 82,500 చెల్లించి పొందే వెసులుబాటును కూడా కేంద్రం ప్రతిపాదించింది.