తమ బేబీ పౌడర్ ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ సోకిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ, బాధితులకు 5.5 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది.
అమెరికాలోని వేలాది మంది బాధితులు దాఖలు చేసిన కేసుల పరిష్కారం కోసం ఈ భారీ మొత్తాన్ని సెటిల్మెంట్గా ప్రకటించారు.
ఈ నిర్ణయంతో సంస్థపై ఉన్న చట్టపరమైన ఒత్తిడి తగ్గనుండగా, బాధితులకు తగిన న్యాయం జరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.