
ఇండోనేసియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
భూకంప కేంద్రం ఎండే నగరానికి 68 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
వరుస ప్రకంపనల నేపథ్యంలో 0.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.