
బిగ్ బాస్ 'అగ్నిపరీక్ష సీజన్-2'లో జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్, తనపై ఉప్పల్ బాలు చేసిన ఆరోపణలకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
ఈ షో కంటెస్టెంట్ల మానసిక స్థైర్యాన్ని పరీక్షించే వేదిక అని, విమర్శలను తట్టుకునే శక్తి ఉంటేనే రావాలని ఆయన కౌంటర్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లను ఎదుర్కోవడం కూడా ఈ షోలో ఒక భాగమని, రెచ్చగొట్టే పరిస్థితుల్లో ఎలా స్పందించాలో పరీక్షించడమే తమ ఉద్దేశమని నవదీప్ వివరించారు.