
ఉత్తరప్రదేశ్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నిర్మల్, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగుల సమీపంలో నిలబడవద్దని, రైతులు పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.