
ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని 12 ప్రాంతాలపై రష్యా గురువారం రాత్రి జరిపిన క్షిపణి, డ్రోన్ల దాడుల్లో 16 మంది మరణించగా, 40 మంది గాయపడ్డారు.
ఈ వైమానిక దాడుల కారణంగా కీవ్లోని మౌలిక వసతులు దెబ్బతిని సుమారు 90,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
డ్రోన్ విడిభాగాల తయారీ కేంద్రాలు, సైనిక స్థావరం, లాజిస్టిక్స్ హబ్లను లక్ష్యంగా చేసుకుని రష్యా ఈ దాడులు జరిపిందని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది.