
వయసు ధ్రువీకరణ పత్రాల్లో సరైన సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలతో బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్ను బీసీసీఐ అండర్-19 జట్టు నుండి తొలగించింది.
ఆస్ట్రేలియాతో జరగనున్న యూత్ వన్డేలకు ఆర్యన్ సావ్సానీని, యూత్ టెస్టులకు తన్మయ్ బలోడాను కొత్తగా ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య సెప్టెంబర్ 18 నుండి అక్టోబర్ 8 వరకు మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు జరగనున్నాయి.