
ఎర్రవల్లిలో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
శాసనసభ, మండలిలో జరిగే ప్రతి చర్చలోనూ పార్టీ ప్రతినిధులు చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పాలనలోని లోపాలను ఎత్తిచూపాలని ఆయన సూచించారు.