
మగ దోమలు శాకాహారులుగా ఉంటూ పూల మకరందాన్ని మాత్రమే తాగుతాయని, మనుషులను కుట్టి రక్తం పీల్చేవి కేవలం ఆడ దోమలు మాత్రమేనని శాస్త్ర పరిశోధనలు చెబుతున్నాయి.
ఆడ దోమలు తమ గుడ్ల అభివృద్ధికి అవసరమైన ప్రొటీన్లు, ఐరన్ కోసం రక్తాన్ని తాగుతాయని, ఈ క్రమంలోనే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని నిపుణులు పేర్కొన్నారు.
దోమలు మనుషులను గుర్తించడానికి శ్వాస ద్వారా వెలువడే కార్బన్ డయాక్సైడ్, శరీర ఉష్ణోగ్రత మరియు చెమట వాసనలను ప్రధాన సంకేతాలుగా వాడుకుంటాయి.