
సికింద్రాబాద్ లోతుకుంటలోని 40 ఎకరాల భూమి వివాదంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రంగనాథ్పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయని, చట్టాన్ని ధిక్కరించే అధికారి ఆ పదవికి అనర్హులని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించిన కోర్టు, ఆయన స్థానంలో సమర్థుడైన అధికారిని నియమించాలని సూచించింది.