
ఫుకెట్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానం గాలిలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా 300 అడుగుల మేర కిందకు పడిపోవడంతో ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మొత్తం 12 మంది ప్రయాణికులు గాయపడ్డారని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
విమానం అకస్మాత్తుగా కుదుపులకు లోనవ్వడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.