
వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించిన 'రోమాంచకం' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో ఘనంగా జరిగింది.
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'రణబాలి' చిత్రం అక్టోబర్ 16న విడుదల కానుందని ఈ సందర్భంగా ప్రకటించారు.