
తెలంగాణలో కొత్తగా మంజూరైన 'చేయూత' పింఛన్ల పంపిణీని ఆగస్టు 16న ములుగులో సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ప్రభుత్వం తొలి విడతగా 50 వేల పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించగా, అక్టోబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసే అవకాశం ఉంది.
అలాగే, ఆగస్టు 15న సంగారెడ్డిలో 1.05 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.