
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందనుండగా, నిర్వాసితులకు మూడో విడతగా రూ.250 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
వెలిగొండ టన్నెల్స్ ద్వారా 10.5 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమల సాగర్లోకి విడుదల చేయనున్నట్లు మంత్రి నిమ్మల వెల్లడించారు.