
ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోను తొలగించిన ఘటనపై వివరణ కోరుతూ, మెటా గ్లోబల్ హెడ్ జోయెల్ కాప్లాన్ను ఆగస్టు 5న సమావేశానికి కేంద్రం ఆదేశించింది.
ప్రభుత్వాన్ని విమర్శించే కంటెంట్కు ప్రాధాన్యత ఇవ్వడం, ఆల్గారిథమ్ పనితీరుపై ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ నేతృత్వంలో ఆగస్టు 5, 6 తేదీల్లో చర్చలు జరగనున్నాయి.
సాంకేతిక లోపం పేరుతో జరిగిన ఈ ఘటనపై మెటా నుంచి పూర్తి లిఖితపూర్వక వివరణతో పాటు క్షమాపణ కూడా కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.