
కార్నింగ్ సంస్థ నిర్వహించిన సర్వేలో 53 శాతం మంది భారతీయులు తమ ఫోన్ స్క్రీన్ పగలడం వల్లే కొత్త ఫోన్ కొంటున్నట్లు వెల్లడైంది.
గత ఏడాదిలో 87 శాతం మంది వినియోగదారులు తమ ఫోన్ను కనీసం ఒక్కసారైనా కింద పడేశామని, 56 శాతం మంది ఫోన్ మన్నికపై ఆందోళన చెందుతున్నామని తెలిపారు.
రిపేరు ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రతి ఐదుగురిలో ఒకరు ఫోన్ పగిలినప్పుడు కొత్తది కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతున్నారని సర్వే పేర్కొంది.
skip