
విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి ఏఐజీ ఆస్పత్రి నిర్మాణానికి ఏపీ మంత్రి నారా లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
రూ.2వేల కోట్ల పెట్టుబడితో 9 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ఆస్పత్రిలో 50కి పైగా వైద్య విభాగాలు, 2.5 ఎకరాల్లో నర్సింగ్ కళాశాల ఉండనున్నాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా 9వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనుండగా, ఇది ప్రపంచస్థాయి హెల్త్కేర్ మరియు రీసెర్చ్ హబ్గా అభివృద్ధి చెందనుంది.