
అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారం ధరలు ఒక్కరోజులోనే గ్రాముకు రూ. 1,210 పెరిగి రూ. 1,60,480కి చేరాయి.
22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,100 పెరిగి రూ. 1,47,100కు చేరుకోగా, వెండి ధర రూ. 5,000 పెరిగి రూ. 2.65 లక్షలుగా నమోదైంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడం ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.