
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారనుండటంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీరప్రాంతాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు 24 గంటల పాటు వేటకు వెళ్లవద్దని భారత వాతావరణ కేంద్రం సూచించింది.
ఏపీపై దీని ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.