
ప్రపంచ దిగ్గజ వాహన తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్, చైనా కంపెనీల పోటీని తట్టుకోవడానికి 50 వేల మందిని తొలగించడంతో పాటు 2030 నాటికి మరో 50 వేల ఉద్యోగాలను తగ్గించాలని నిర్ణయించింది.
ఖర్చుల నియంత్రణలో భాగంగా ఆడి, పోర్షే, లాంబోర్గిని బ్రాండ్ల మోడళ్లను తగ్గించడంతో పాటు, భారత్లోని తమ ఉద్యోగుల్లో సుమారు 12 శాతం మందిని తొలగించే అవకాశం ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి.
మరోవైపు టెక్ రంగంలో ఒరాకిల్ సంస్థ గత 8 నెలల్లో 21 వేల మందిని తొలగించగా, తాజాగా మరో 7 వేల మందికి ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.