
బ్యాంక్ ఆఫ్ బరోడా వ్యవస్థలోకి చొరబడిన హ్యాకర్లు దాదాపు 1 టెరాబైట్ ఖాతాదారుల సమాచారాన్ని డార్క్వెబ్లో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి.
లీకైన డేటాలో ఆధార్ నంబర్లు, రుణ వివరాలు, ఆడిట్ నివేదికలు మరియు అంతర్గత కమ్యూనికేషన్ పత్రాలు ఉన్నాయని సైబర్ భద్రత నిపుణుడు శ్రీకాంత్ లక్ష్మణన్ ధృవీకరించారు.
ఈ దాడి వెనుక 'ట్రిపుల్ఎక్స్' అనే హ్యాకింగ్ గ్రూప్ ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ, బ్యాంక్ ఆఫ్ బరోడా లేదా ఆర్బీఐ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.