
ఎస్సీఓ సదస్సులో దేశాధినేతల గ్రూప్ ఫొటో నుంచి ప్రధాని మోదీని క్రాప్ చేస్తూ పాకిస్థాన్ పీఎంఓ వివాదాస్పద చర్యకు పాల్పడింది.
సదస్సులో పాల్గొన్న ఇతర దేశాల నాయకులను ఉంచుతూ, మోదీని మాత్రం ఫొటో నుంచి తొలగించి పాక్ తన దుర్బుద్ధిని చాటుకుంది.
ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుండగా, పాకిస్థాన్ పీఎంఓ అధికారికంగా ఈ ఫొటోను షేర్ చేయడం గమనార్హం.