
వైద్యుల సూచన లేకుండా సొంతంగా మల్టీ విటమిన్లు, క్యాల్షియం, ఐరన్ వంటి సప్లిమెంట్లను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్యాల్షియం మరియు ఐరన్ మాత్రలను ఒకేసారి తీసుకోవడం వల్ల అవి రక్తంలో కలిసిపోవడానికి పోటీ పడతాయని, వీటిని వేర్వేరు సమయాల్లో తీసుకోవాలని సూచించారు.
థైరాయిడ్, బీపీ, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవారు మందుల సమయ పాలన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు స్పష్టం చేశారు.