
రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా మరో 3,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విజయనగరంలో ప్రకటించారు.
ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ (TET) నిర్వహించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 4,034 క్లస్టర్ పాఠశాలల ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని, బోధనా పద్ధతులపై వారి సూచనలను స్వీకరించారు.