
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని సర్వేలు చెబుతుండటంతో ప్రతిపక్ష పార్టీ భయపడుతోందని సీఎం చంద్రబాబు విమర్శించారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తున్నామని, దీనివల్ల ప్రజలు నేరుగా తమ నాయకులను ఎన్నుకోవచ్చని ఆయన తెలిపారు.
వృద్ధులు, వితంతువులకు ఇప్పటివరకు రూ.73,507 కోట్ల పింఛన్లు పంపిణీ చేశామని, ఎన్నికల సమయంలో డబ్బులకు ఆశపడకుండా అవినీతి లేని పాలన కోసం ఓటు వేయాలని కోరారు.