
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చేరగా, ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రికి చేరుకుని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, పద్మారావు గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.