
మంగళవారం జరిగిన గ్రూప్ 'బి' ఆఖరి మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు యూఏఈపై 34 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు అర్హత పొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 103/7 స్కోరు చేయగా, యూఏఈ జట్టు 69/9 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది.
ఈ విజయంతో సెమీఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న బంగ్లాదేశ్ జట్టు, గురువారం జరగనున్న సెమీస్లో భారత మహిళా జట్టుతో తలపడనుంది.