
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రంలో మమిత బైజు హీరోయిన్గా నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
చిత్ర యూనిట్ మంగళవారం చెన్నైలో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో నటి రాధిక శరత్ కుమార్, దర్శకుడు వెంకీ అట్లూరి సినిమా విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.