
రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు నేరుగా రైలు మార్గాన్ని నిర్మించే ప్రతిపాదనను రష్యా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మారత్ ఖుస్నుల్లిన్ పరిశీలిస్తున్నారు.
బోస్ఫరస్, హోర్ముజ్ జలసంధి మార్గాల్లోని భద్రతా సవాళ్లను అధిగమించేందుకు తుర్క్మెనిస్థాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ గుండా ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే రష్యా నుంచి రైలులో ఇరాన్ లేదా పాకిస్థాన్ రేవులకు చేరుకుని, అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా భారత్కు సరుకు రవాణా సులభతరం అవుతుంది.