
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) కీలక వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించింది.
ఈ సమావేశంలో వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని, ప్రస్తుత రేట్లనే కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ద్రవ్యోల్బణం మరియు ఆర్థిక వృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని కమిటీ ఈ కీలక నిర్ణయాలను ప్రకటించనుంది.