
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని, లేనిపక్షంలో తీవ్ర సైనిక చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు.
అమెరికా, ఇరాన్ మరియు ఒమన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని, బుధవారం నాటికి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు.
ప్రస్తుతం చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని పేర్కొన్న ట్రంప్, ఒకవేళ ఇరాన్ చర్చల నుంచి వైదొలిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.