
ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఈ ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.