
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 2026-27 జాబ్ క్యాలెండర్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది.
రాష్ట్రంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో పాటు, తిరుపతిలో రూ.500 కోట్లతో లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం మోతడక గ్రామంలో 2,344 ఎకరాల భూమిని సమీకరించే ప్రతిపాదనతో పాటు, పలు జిల్లాల్లో భారీ డేటా సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయించారు.