
తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి ఆకులను నీటిలో మరిగించి మిరియాల పొడితో కలిపి కషాయంగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో తులసి కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.