
తెలంగాణలో 22ఏ నిషేధిత భూముల జాబితా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి నివాసమే 22ఏ జాబితాలో ఉందని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలోకి మార్చారని ఆయన విమర్శించారు.
డబ్బున్న వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ సామాన్యుల ఆస్తులకు భద్రత లేకుండా చేస్తున్నారని లక్ష్మణ్ దిల్లీలో విలేకరులతో అన్నారు.