
సముద్ర మార్గాల్లోని రవాణా ముప్పును అధిగమించేందుకు రష్యా నుంచి భారత్కు ప్రత్యక్ష రైల్వే కనెక్షన్ను ఏర్పాటు చేసే అంశాన్ని రష్యా పరిశీలిస్తోంది.
తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్థాన్ల మీదుగా వెళ్లే భూమార్గ కారిడార్ల సాధ్యాసాధ్యాలను రష్యా ఉప ప్రధాని మరాత్ ఖుస్నుల్లిన్ వెల్లడించారు.
ఈ రైల్వే నెట్వర్క్ సాకారమైతే, హోర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాలపై ఆధారపడకుండా భారత్కు నేరుగా వస్తువుల రవాణా సాధ్యమవుతుంది.