
ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందించే జీవో 57ను మంగళవారం పాలకొల్లులో మంత్రులు విడుదల చేశారు.
ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం సుమారు రూ.1100 కోట్ల ఆర్థిక భారాన్ని భరిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 2.45 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఆక్వా రంగంలోని 2 లక్షల మంది రైతులకు ఈ నిర్ణయం ద్వారా మేలు జరుగుతుంది.