
చెన్నైలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 334 బంతుల్లో 270 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ ఇన్నింగ్స్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లు బాదిన కిషన్, 80.84 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ తన కెరీర్లో రెండో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీని నమోదు చేశాడు.
నవంబర్లో న్యూజిలాండ్తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే లక్ష్యంతో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమక్షంలోనే ఈ ప్రదర్శన చేశాడు.