
కువైట్లో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల నుంచి డీజిల్ను దొంగిలించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం పట్టుకుంది.
ఈ కేసులో ఒక కువైట్ పౌరుడితో పాటు భారతీయులు సహా మొత్తం 41 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులు అక్రమ దందా కోసం ఉపయోగించిన 38 ట్రక్కులు, బస్సులను స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.